బాలల హక్కులు - బాధ్యతలు

స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, మానవహక్కులు మొదలైన వాటన్నిటికీ సుదీర్ఘ పోరాట చరిత్ర ఉంది. వాటిని సాధించే క్రమంలో గొప్ప అనుభవాల్ని సంపాదించాం. కానీ, ఆ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, మానవహక్కుల విస్తారంలోకి పిల్లల్ని చేర్చం.

నేటి ఈ ప్రజాస్వామ్య ప్రపంచంలో సైతం తల్లిదండ్రులు, టీచర్లు, పనిచేసేచోట్ల యజమానులు ఇంకా బయట ప్రతీచోటా పెద్ద వాళ్ళు పిల్లల్ని కొట్టటం, తిట్టటం, అవమానించటం, స్వార్ధ ప్రయోజనాలకు వినియోగించుకోవడం, సరియైన ఆహారం అందించకపోవడం జరుగుతోంది, ఇది ఘోరమైన నేరం.

జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో మానవహక్కుల దృక్పధం అనేక కోణాల్లో సమాజంలోకి చొచ్చుకొనిపోయింది. కానీ పిల్లల హక్కుల గురించిన జ్ఞానంగానీ, చైతన్యంగానీ, ప్రయత్నంగానీ అంతగా జరుగలేదన్నారు గనుక తల్లిదండ్రులకు పిల్లల మీద సర్వహక్కులూ ఉంటాయనుకునే దుష్టనీతి నుంచి మనం ఇంకా బయటపడలేదు. అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే, బుద్ధి జీవులనబడే వాళ్ళు కూడా - దారిద్ర్యం, నిరుద్యోగం, వివక్షత వంటి పరిస్ధితుల్ని మూలకారణాలుగా పరిగణిస్తూ - పిల్లలకు చేస్తున్న అన్యాయాన్ని సమర్ధిస్తున్నారు.

అందుకే పిల్లల హక్కులు, పిల్లల సంరక్షణ అనే దృక్పథాలు బలపడటానికి ఒక బృహత్ ప్రచారం, ఒక ఉద్యమం అవసరమయ్యాయి. ఈ నేపధ్యంలోనే ఐక్యరాజ్య సమితి 1989లో బాలల హక్కుల అంతర్జాతీయ ఒడంబడికను రూపొందించింది. దీనికి ముందు కూడా పిల్లల హక్కులకు సంబంధించి అంతర్జాతీయ సదస్సులు, ఒడంబడికలు, అనేక ప్రయత్నాలు, కార్యక్రమాలు జరిగినప్పటికీ ఈ ఒడంబడిక విశిష్టమైనది, విలక్షణమైనది, సమగ్రమైనది. ఇది పిల్లల పౌర రాజకీయ, ఆర్ధిక, సాంఘిక, సాంస్కృతిక హక్కుల పరిరక్షణకు పూనుకున్న ఏకైక ఒప్పందం, అన్ని దేశాల్లోను, అన్ని పరిస్ధితుల్లోను పిల్లలందరికీ వర్తించే సార్వత్రిక ఒప్పందమిది. పరిమితవనరులున్న ప్రభుత్వాలు కూడా పిల్లల హక్కులు కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని నిర్దేశించిన బేషరతు ఒప్పందమిది. రెండు దేశాలు తప్ప ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలన్నీ ఈఒడంబడికను ఆమోదించాయి. భారత ప్రభుత్వం 1992 డిసెంబరు 11 న ఈ ఒడంబడికను ఆమోదించి సంతకం చేసింది.

ఈ తీర్మానంలో పేర్కొన్న బాలల హక్కుల్ని సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే, అలాగే పిల్లల హక్కుల్ని పరిరక్షించడానికి ఎవరికైనా హక్కునిస్తుంది. ఈ తీర్మానం.

మార్గదర్శక సూత్రాలు: అన్ని హక్కలకు సాధరణంగా ఉండే నియమాలు

ఆర్టికల్ - 1

ఆర్టికల్ - 2

ఆర్టికల్ - 3

ఆర్టికల్ - 4

ఆర్టికల్ - 6

ఆర్టికల్ - 12

అభివృధ్ధి మరియు జీవించే హక్కు: జీవించేందకు ముఖ్యమైన హక్కు మరియు సంపూర్ణమైన గౌరవమైన జీవితం

ఆర్టికల్ - 7

ఆర్టికల్ - 20

ఆర్టికల్ - 23

ఆర్టికల్ - 24

అత్యున్నతమైన ఆరోగ్య ప్రమాణాలను పొందేందుకు - రోగానికి చికిత్స పొందేందుకు, ఆరోగ్యాన్ని తిరిగి పొందేందుకు, బిడ్డకు ఉన్న హక్కును భాగస్వామ్య దేశాలు గుర్తించాలి. అలాంటి ఆరోగ్య సేవల్ని పొందే హక్కు నుండి ఏ బిడ్డా దూరం కాకుండా భాగస్వామ్య దేశాలు శ్రద్ధ తీసుకుంటాయి.

ఈ హక్కును దేశాలు అమలు చేసేందుకు భాగస్వామ్య దేశాలు పాటుపడతాయి. ప్రత్యేకించి -

ఆర్టికల్ - 25

ఆర్టికల్ - 27

ఆర్టికల్ - 28

ఆర్టికల్ - 30

ఆర్టికల్ - 31

రక్షణ హక్కులు : అపాయము నుంచి సంరక్షణ పొందటము

ఆర్టికల్ - 19

ఆర్టికల్ - 32

ఆర్టికల్ - 36

ఆర్టికల్ - 34

ఆర్టికల్ - 37

భావ ప్రకటన హక్కులు : భావ ప్రకటనను స్వేచ్ఛగా తెలియ జేయట

ఆర్టికల్ - 13

ఆర్టికల్ - 14

ఆర్టికల్ - 16

ఆర్టికల్ - 17

ప్రసార మాద్యమం యొక్క ప్రాముఖ్యతను భాగస్వామ్య దేశాలు గుర్తించాలి. విభిన్న రీతులలో ఉన్న జాతీయ, అంతర్జాతీయ సమాచారాన్ని ఆ మాధ్యమం ద్వారా బిడ్డకు అందించాలి. ప్రత్యేకించి బిడ్డకు సామాజిక, భౌతిక, నైతిక పరిపూర్ణత శారీరక, మానసిక ఆరోగ్యాలను పరిజ్ఞానాన్ని ప్రసార మాధ్యమం ద్వారా అందించాలి. అందుకోసం భాగస్వామ్య దేశాలు ఈ క్రింది చర్యలు తీసుకోవాలి.

నలభైకోట్ల మంది పిల్లలున్న దేశం భారతదేశం, సాంఘికంగా, ఆర్ధికంగా ఎంతో ప్రగతి సాధించినా, ఇంకా చాలా మంది పిల్లలు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు. దయనీయమైన, అమానుష మైన పరిస్ధితుల్లో బతుకుతున్న పిల్లలు లక్షల్లో ఉన్నారు. మగపిల్లల కన్నా ఆడపిల్లలు మరింతగా బాధలు ఎదుర్కొంటున్నారు. సరైన ఆహారం లేక, ఆశ్రయం లేక, వీదుల్లో బతుకుతూ, అనారోగ్యం పాలై అనేక రకాల లైంగిక హింసలకి గురవుతూ, వ్యభిచారం కోసం అక్రమ రవాణాకి గురవుతూ వారుపడే బాధలు అన్నీ ఇన్నీ కావు. బాల కార్మికులుగా పసితనంలోనే బాల్యం కోల్పోతున్న కొందరైతే, బాల్య వివాహం వల్ల బతుకునే కోల్పోతున్నవారు మరికొందరు. అలాంటి పిల్లలకి ప్రత్యేక రక్షణ, ఆదరణ కావాలి. వారు విద్యావంతులవ్వాలి. అకృత్యాల బారిన పడకుండా, ఎవరి దోపిడీకి గురి కాకుండా, సురక్షణతో, గౌరవంతో బతికే జీవితం వారికి కావాలి. దీనికి గాను సమాజంలో అందరి భాగస్వామ్యం అవసరం.

ముఖ్యంగా అంగన్ వాడి కార్యకర్తలు, ఉపాధ్యాయులు, పంచాయితీ సభ్యులు, యువజన సేవకులు సమిష్టిగానే కాకుండా, వ్యక్తిగతంగా కూడా తమ సేవల్ని అందించాలి.

పంచాయితీ సభ్యులంటే సమాజంలో గౌరవమేకాక, మహిళా శిశురక్షణకు ఎంతో కృషి చెయ్యగలిగిన వారుగా ప్రజలకి ఆశ ఉంది. ప్రజలచే ఎన్నుకోబడిన వీరికి ప్రజల సంక్షేమంతో పాటు, పిల్లల సంక్షేమం విషయంలో గురుతర బాధ్యత ఉంది.

బోధన వల్లే మనుషుల జీవితాలు బాగుపడతాయి అన్న ఆశ నాకు - ప్రఖ్యాత మేధావి జార్జి బెర్నార్డ్ షా ఉవాచ ఇది. గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే మహేశ్వరుడన్న విశ్వాసం వున్న సంప్రదాయం మనది. అందువల్ల మన సమాజంలో అంగన్ వాడి కార్యకర్తలను, ఉపాధ్యాయులను ఎప్పుడూ ఉన్నత గౌరవస్ధానంలోనే ఉంచుతున్నాము.

తల్లిదండ్రుల ప్రభావంలాగే అంగన్ వాడి కార్యకర్తల, ఉపాధ్యాయుల ప్రభావం కూడా పిల్లల మీద బలంగా ఉంటుంది. అందువల్ల పిల్లల బతుకుల్ని తీర్చిదిద్దటంలో వీరి పాత్ర ప్రముఖమైనది. ఉపాధ్యాయులు, అంగన్ వాడి కార్యకర్తలు పిల్లల్ని బడిలోనే కాదు, బతుకులో కూడా సంరక్షించగలరు. పసితనంలో వారికి అలవాటు చేసే మంచి చెడ్డలు, పర్యవేక్షణ పిల్లల భావి జీవితాన్ని తీర్చిదిద్దుతుంది. అంతేకాక ఉపాధ్యాయులకి, అంగన్ వాడి కార్యకర్తలకి తమ పరిసర సమాజంతో ఉండే బంధం ఎంతో గాఢమైంది.

అంగన్ వాడి కార్యకర్తలు, ఉపాధ్యాయులు, పంచాయితీ సభ్యులు పిల్లల సంక్షేమం విషయంలో, బాధ్యతాయుతంగా చెయ్య గలిగిన పనులేమిటో పరిశీలిద్దాం.

పిల్లలకీ హక్కులున్నాయి. పరిరక్షణకి ఎంతో కృషి జరుగుతోంది. సమాజంలోని అందరూ మరింత బాధ్యతగా కృషి చేస్తే త్వరితంగా ఎందరో పిల్లల బతుకులు మెరుగుపడతాయి.

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020